పోలీసుల అసభ్య ప్రవర్తనపై బిఆర్ఎస్ మహిళ నాయకురాలు ధర్నా నిరసన
* హక్కును కాలరాయడం రాజ్యాంగ విరుద్ధమని బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
జమ్మికుంట సెప్టెంబర్ 8 (ప్రజావాణి)
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు మహిళా కార్యకర్తల పట్ల పోలీసులు అసభ్యకరంగా వ్యవహరించిన తీరును నిరసిస్తూ హుజురాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న
జమ్మికుంట మాజీ కౌన్సిలర్ పొనగంటి విజయ మల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న నాయకులు మహిళా కార్యకర్తల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు పోలీసు వ్యవస్థను ప్రభుత్వం తన చేతిలో కీలుబొమ్మగా మార్చుకుందనిఆరోపించారుశాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం రాజ్యాంగ విరుద్ధమని బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారుఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

