ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
పసర విద్యుత్ విభాగంలో పని తనిఖీదారుగా విధులు నిర్వహిస్తున్న దండు రామచందర్ గారు పదోన్నతి పొందారు.
పసరలో ఎంతో అంకితభావంతో పనిచేసి తన సేవలతో అందరి మన్ననలు పొందారు.
ఆయన సేవలకు గుర్తింపుగా తాడ్వాయి విభాగంలో సీనియర్ పని తనిఖీదారుగా పదోన్నతి లభించింది.
తాడ్వాయి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి ఉత్తర్వులను అధికారులు అందజేశారు.
ఈ సందర్భంగా సహచర సిబ్బంది ఆయనను పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
కష్టానికి తగ్గ ఫలితం సాధించారంటూ అభినందనలు తెలిపారు.
ఈ పదోన్నతి ఆయన భవిష్యత్తుకు మరిన్ని విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
మీ సేవలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

