పచ్చదనం భవిష్యత్తు వైపు చెరువుకొమ్ము తండా.. పచ్చని భవిష్యత్తుకు శ్రీకారం!
ప్రతి ఇంటికి పండ్ల మొక్కల పంపిణీ!
చెన్నారావుపేట ఆగస్టు 19 ప్రజావాణి
మండల కేంద్రంలోని చెరువు కొమ్ము తండా పచ్చదనంతో కొత్త శోభను సంతరించుకుంటోంది. వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్ భూక్య మహబూబ్ సింగ్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. నాటిన ప్రతి ఒక మొక్కను వృక్షంగా మార్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, గ్రామాన్ని హరిత శోభితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ఆరోగ్యాన్ని పెంచే ఈ హరిత యజ్ఞంలో పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

