మున్సిపాలిటీ కామాటి దారెల్లి రాములు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం.
ఎరగాని నాగన్న గౌడ్.
హుజూర్నగర్ ఆగస్టు 12 (ప్రజావాణి)
అనారోగ్యంతో గత వారంలో మృతి చెందిన మున్సిపాలిటీ కామాటి దారెల్లి రాములు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని, రాష్ట్ర ఐఎన్టియసి ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ అన్నారు.
హుజూర్నగర్ మున్సిపాలిటీ కామాటి దారెల్లి రాములు గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ దారెల్లి రాములు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, చిత్రపటానికి నివాళులు అందించారు.
ఈ సందర్భంగా నాగన్న గౌడ్ మాట్లాడుతూ రాములు మృతి బాధాకరమని, మున్సిపాలిటీలో తన విధులను నిబద్ధతతో నిర్వహించిన ఆయన సేవలు మరువలేనివని అన్నారు. రాములు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాములు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో 14వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోల్లపూడి యోహాన్, మాజీ కౌన్సిలర్ చింతకాయల రాము, ఐఎన్టియుసి రైస్ మిల్స్ అధ్యక్షులు సలిగంటి జానయ్య, యూత్ నాయకులు కిరణ్, మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

