📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్హర్‌ ఘర్‌ తిరంగా విజయవంతానికి బీజేపీ సన్నాహక సమావేశం

హర్‌ ఘర్‌ తిరంగా విజయవంతానికి బీజేపీ సన్నాహక సమావేశం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, ఆగస్టు 7 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. బెజ్జంకి మండల బీజేపీ అధ్యక్షుడు కొలిపాక రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆగస్టు 10 నుంచి 14 వరకు చేపట్టనున్న తిరంగా యాత్ర, జాతీయ జెండాల పంపిణీ, ఇతర కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

**దేశభక్తిని ప్రతి ఇంటికి చేర్చడమే లక్ష్యం**

మండల ఇన్‌చార్జి ముత్యాల జగన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యువత, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు.

“తిరంగా దేశ ఐక్యతకు ప్రతీక”

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ జెండా దేశ ఐక్యత, సమగ్రత, త్యాగానికి ప్రతీక అని అన్నారు. ప్రతి గ్రామంలో తిరంగా యాత్రలు నిర్వహించి, ప్రతి కార్యకర్త కనీసం పది కుటుంబాలకు జాతీయ జెండాలను అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బుర్ర మల్లేశం గౌడ్, గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, బీజేపీ మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular