లింగాపూర్లో బీజేపీ నేత కోనేరు శశాంక్ మానవతా సహాయం.
బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత.
కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియో జకవర్గం కోటగిరి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన నిరడి సుజాత కూతురు మంగళవారం అనారోగ్యం తో మరణించింది.వారి ఆర్థిక పరిస్థితి బాగా లేదని స్థానిక బీజేపీ నాయకుల ద్వారా తెలుసుకున్న బాన్సువాడ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి స్థానిక,మండల నాయకుల ద్వారా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని పంపించి,అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.అలాగే కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తాను తోడుగా ఉంటానని ఈ సందర్భంగా కోనేరు శశాంక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోటగిరి బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్,బీజేపీ బూత్ అధ్యక్షులు గంజిగా వ్ శేఖర్,గ్రామ పెద్దలు శివనంద్,భూమయ్య,గంగారాం, అనిల్,నిరడి సంతోష్,విఠల్,గంగారాం,తదితరులు పాల్గొన్నారు.




