📄 ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
HomeతెలంగాణHanumakondaపెంచాల రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పెంచాల రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

📰 Generate e-Paper Clip

పెంచాల రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

 

దామెర, ప్రజావాణి ఆగస్టు1

 

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు, వార్డు సభ్యురాలు పెంచాల భాగ్యబాబు తల్లి పెంచాల రాధమ్మ ఇటీవల మృతి చెందగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

ఈ సందర్భంగా రాధమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన చల్లా ధర్మారెడ్డి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular