📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguఅప్రమత్తతే రక్ష- పస్రా ఎస్ఐ తాజుద్దీన్

అప్రమత్తతే రక్ష- పస్రా ఎస్ఐ తాజుద్దీన్

📰 Generate e-Paper Clip

అప్రమత్తతే రక్ష- పస్రా ఎస్ఐ తాజుద్దీన్

*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)*:-
సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త పద్ధతులు వాడుతున్నారని పస్రా ఎస్.ఐ తాజుద్దీన్ హెచ్చరించారు.మోసగాళ్లు బ్యాంకు అధికారులుగా, పోలీసులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, కస్టమర్ కేర్ ప్రతినిధులుగా లేదా మీకు తెలిసిన వ్యక్తులుగా నటిస్తూ ఫోన్ చేస్తున్నారని తెలిపారు.ఎల్లప్పుడూ కాల్ చేసే వ్యక్తి గుర్తింపును సరిచూసుకోవాలని ప్రజలకు సూచించారు.ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు పాస్‌వర్డ్‌లు ఏటీఎం పిన్నులుఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు.తెలియని లింక్‌లు క్లిక్ చేయడం, డబ్బు పంపడం లేదా వ్యక్తిగత వివరాలు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాలని కోరారు.ఆన్‌లైన్‌లో ఏదైనా లావాదేవీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.అనుమానం వస్తే వెంటనే కాల్ కట్ చేసి సంబంధిత బ్యాంకు లేదా అధికారిని నేరుగా కలవాలని సూచించారు.ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ మోసాలను అరికట్టవచ్చని ఎస్సై పేర్కొన్నారు.ఎవరైనా మోసపోతే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.చివరిగా “అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి” అని ప్రజలకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.