గాజగట్లపల్లి గ్రామంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ సహకారంతో స్మార్ట్ అంగన్వాడీ ప్రారంభోత్సవం.
మన ప్రజావాణి మెదక్ జిల్లా ప్రతినిధి జూలై 22.
గాజగట్లపల్లి, మెదక్ జిల్లా గాజగట్లపల్లి గ్రామంలో ఎస్ఎం సెహగల్ ఫౌండేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ సహకారంతో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన స్మార్ట్ అంగన్వాడీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య, పరిశుభ్రమైన వాతావరణం మరియు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఈ అంగన్వాడీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ ప్రతినిధి ఆసియా , సీడీపీఓ ఎస్ఎం సెహగల్ ఫౌండేషన్ స్టేట్ ప్రోగ్రామ్ లీడ్ శ్రీ నీరజ్ దుబే, ప్రాజెక్ట్ లీడ్ శ్రీ శివ శరణప్ప, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీ గౌతమ్, బృంద సభ్యులు కావ్య, విక్రాంత్, విజయ, ప్రజ్ఞ, చాంద్బాషా పాల్గొన్నారు. అలాగే గ్రామ సర్పంచ్ శ్రీ నాగభూషణం, గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ ఉపాధ్యాయులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సమావేశంలో చిన్నారుల సమగ్ర అభివృద్ధిలో అంగన్వాడీల పాత్ర, పరిశుభ్రత, పోషకాహారం, నాణ్యమైన ప్రాథమిక విద్య, సమాజ భాగస్వామ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. స్మార్ట్ అంగన్వాడీల ద్వారా గ్రామీణ చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు.
ఈ స్మార్ట్ అంగన్వాడీ అభివృద్ధి పనుల్లో భాగంగా నీటి లీకేజీ వల్ల దెబ్బతిన్న ఫ్లోరింగ్ మరమ్మతులు, మరుగుదొడ్ల పునరుద్ధరణ, వాష్ ఏరియా అభివృద్ధి, స్మార్ట్ టీవీ ఏర్పాటు, బాలా (BALA) విద్యా పెయింటింగ్స్, చిన్నారుల కోసం ఆట వస్తువులు, కుర్చీలు, ఇన్వర్టర్ మరియు బ్యాటరీ ఏర్పాటు వంటి పలు సౌకర్యాలను కల్పించారు. ఈ మార్పులతో అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు మరింత సురక్షితమైన, పరిశుభ్రమైన, ఆకర్షణీయమైన మరియు అభ్యాసానికి అనుకూలమైన కేంద్రంగా రూపుదిద్దుకుంది.
ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఎస్ఎం సెహగల్ ఫౌండేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ సహకారంతో విజయవంతంగా అమలు చేయడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని చోట్ల చేపట్టాలని గజ గట్ల పల్లి. గ్రామ.సర్పంచ్. నాగభూషణం.కోరారు.




