📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialమారేడుపల్లిలో విద్యుదాఘాతంతో ఎద్దు మృతి: 50 వేల నష్టం

మారేడుపల్లిలో విద్యుదాఘాతంతో ఎద్దు మృతి: 50 వేల నష్టం

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుద్దే తిరుపతి తన ఆరేళ్ల ఎద్దుతో ఉదయం 11:30 గంటల సమయంలో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఆ ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న మండల పశువైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ జరిపారు. మరణించిన ఎద్దు విలువ సుమారు 50 వేల రూపాయలు ఉంటుందని వెటర్నరీ డాక్టర్ బూర మనోజ్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.