బెజ్జంకి, జూలై 2 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో కొండ అనసూర్య–లక్ష్మీనారాయణ రావు దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం సర్పంచ్ ఎర్రల జానకి రాజు భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రల జానకి రాజు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని, లబ్ధిదారులు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. పంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, చింతలపల్లి లతకొండల్ రెడ్డి, సొల్లు బాలయ్య, న్యాలం శారద శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పులి శ్రీనివాస్, బొమ్మరవేణి సంతోష్, గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



