📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 

వైఎస్సార్ కడప జిల్లా (ప్రజావాణి న్యూస్ జూన్ 28) పోరుమామిళ్ల మండల పరిధిలోని పుల్లీవీడు గ్రామపంచాయతీ స్థానిక విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది.దేశాన్ని పోలియో రహితంగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ సిబ్బంది పోలియో వ్యాక్సిన్ చుక్కలను వేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యూమన్ రైట్స్ నేషనల్ జాయింట్ సెక్రెటరీ కవలకుంట్ల మధుబాబు హాజరయ్యారు. ఆయన స్వయంగా చిన్న పిల్లలకు నోట్లో పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి,ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ నేషనల్ జాయింట్ సెక్రెటరీ కవలకుంట్ల మధుబాబు మాట్లాడుతూ,భావితరాల ఆరోగ్య భద్రతకు పల్స్ పోలియో చుక్కలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజంలో శారీరక వైకల్యం అనే మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని,దనికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని తల్లులు, తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలందరినీ తప్పనిసరిగా దగ్గరలోని పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కల మందు వేయించాలని పిలుపునిచ్చారు.పోలియో చుక్కలు వేసుకోకుండా మిగిలిపోకూడదనే లక్ష్యంతో మానవతా దృక్పథంతో వైద్య ఆరోగ్య శాఖతో కలిసి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కూడా తమ వంతు సామాజిక బాధ్యతగా మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎండలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న ఆశా వర్కర్లు,ఏఎన్ఎంలు,అంగన్‌వాడీ కార్యకర్తల సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఉత్సాహంగా తరలివచ్చిన తల్లులు  ఉదయం నుంచే పుల్లీవీడు హెల్త్ క్లినిక్‌కు స్థానిక ప్రజలు,తల్లులు తమ చిన్న పిల్లలను ఎత్తుకుని ఉత్సాహంగా తరలివచ్చారు.వైద్య సిబ్బంది ప్రణాళికాబద్ధంగా ప్రతి ఒక్క చిన్నారికి చుక్కల మందు వేసి వేలికి సిరా గుర్తును వేశారు.క్లినిక్ పరిసరాల్లో పోలియో ప్రాధాన్యతను తెలిపే అవగాహన పోస్టర్లను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారులు,డాక్టర్ శ్రీవిద్య,కమ్యూనిటీ హెల్త్ ఆఫీస సునీత,ఆశ వర్కర్ జాస్మిన్,అంగన్‌వాడీ టీచర్లు సుభాబి,గ్రామ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular