📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణRajanna Sircillaప్రజావాణి రిపోర్టర్‌పై దాడి ఖండనీయం అక్రమ ఇటుక భట్టీ వ్యవహారంపై వార్త సేకరణకు వెళ్లిన జర్నలిస్టుపై...

ప్రజావాణి రిపోర్టర్‌పై దాడి ఖండనీయం అక్రమ ఇటుక భట్టీ వ్యవహారంపై వార్త సేకరణకు వెళ్లిన జర్నలిస్టుపై దౌర్జన్యం

📰 Generate e-Paper Clip

ప్రజావాణి రిపోర్టర్‌పై దాడి ఖండనీయం
అక్రమ ఇటుక భట్టీ వ్యవహారంపై వార్త సేకరణకు వెళ్లిన జర్నలిస్టుపై దౌర్జన్యం
మన సమగ్ర ప్రజావాణి ప్రతినిధి
నిబంధనలకు విరుద్ధంగా ఇటుక భట్టీ నిర్వహిస్తున్న విషయంపై సమాచారం సేకరించేందుకు వెళ్లిన ప్రజావాణి రిపోర్టర్‌పై జరిగిన దాడి జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో తన విధులు నిర్వహిస్తున్న రిపోర్టర్‌పై దౌర్జన్యానికి పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు అక్రమంగా ఇటుక భట్టీ నిర్వహిస్తున్న వ్యవహారంపై వార్త సేకరణ కోసం వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు రిపోర్టర్‌ను అడ్డుకుని, బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అనంతరం వాగ్వాదం చోటుచేసుకుని దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో రిపోర్టర్‌కు గాయాలు అయినట్లు తెలిసింది.
ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా స్పందించాయి. మీడియా స్వేచ్ఛను అణచివేయాలని చేసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించాయి. బి ఆర్ ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు తమ రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడితే ప్రజల్లో తప్పు సంకేతాలు వెళ్తాయని పేర్కొన్నాయి.
దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై పార్టీ నాయకత్వం కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, వార్తా సేకరణకు వెళ్లిన రిపోర్టర్లపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular