గుల్లకోట గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుండి మంజూరైన రూ. 1,78,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ పంపిణీ చేశారు. లబ్ధిదారులలో పి. శ్రీకాంత్ (రూ. 60,000), పి. లక్ష్మణ్ (రూ. 57,500), బి. అభిషేక్ (రూ. 22,500), జి. మల్లవ్వ (రూ. 22,500), పి. కొమురమ్మ (రూ. 13,500), ఎల్. మమత (రూ. 12,000) ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బి సత్యం, ఏఎంసీ డైరెక్టర్ డి మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బి భూమయ్య, జి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
0
13




