తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారము “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ
మన సమగ్ర ప్రజావాణి జూన్ 04
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
తేది 04.06.2026 నుంచి 10.06.2026 వరకు వార్డు సమావేశములు
నిర్వహించ బడును. ఈ సమావేశములో డ్రగ్స్ నిర్మూలన, సర్ పై అవగాహనా, సీజనల్ వ్యాధులపై అవగాహనా నిర్మూలనపై సూచనలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు, ఆవశ్యకత తదితర అంశాల పై చర్చించడం జరుగుతుంది ఇందులో భాగంగా రేపు అనగా తేదీ 04.06.2026 రోజున వార్డు నెం 4,5,6,7,8 లకు అందోల్ లోని రామాలయంలో ఉదయం 10:30 నిముషాలకు జరుగుతుంది కావున ప్రజలు ఇట్టి వార్డు సమావేశములు విజయవంతం చేయగలరు. ఈ సమావేశాములలో వ్యవసాయ శాఖా అధికారులు,వైద్య ఆరోగ్యశాఖ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొంటారు.





