📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్లలో CITU 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఘనంగా జెండా ఆవిష్కరణ

పోరుమామిళ్లలో CITU 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఘనంగా జెండా ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల (మే30 ప్రజావాణి) పోరుమామిళ్ల లోని విద్యుత్ ఆఫీసు ముందు ఉన్న సిఐటియు జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ షేక్ గౌసియాబేగం అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి యన్ భైరవప్రసాద్ మాట్లాడుతూ,కార్మిక సంఘాలను ఏకం చేయడంలో  పాత్ర చాలా కీలకమైంది.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏ పార్టీ అయినా సరే,తప్ప అన్ని పార్టీలతో కార్మికుల సమస్యల కోసం ఐక్యమవుతుంది,ఐక్యం చేసింది.ఇలాంటి తరుణంలో  ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని” పిలుపునిచ్చారు “1970 మే 30న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఇతర సంఘాల నుండి విడిపోయి ఏర్పడింది.1974లో రైల్వే 17 లక్షల మందితో సమ్మె చేసి  విధానాలను దేశ ప్రజలకు తెలియజేసింది.1982లో ముంబైలో టెక్స్టైల్స్ సమ్మె 5 లక్షల మందితో 18 నెలలు సమ్మె చేసి విజయాలు సాధించింది.మహిళా కార్మికుల కోసం ప్రత్యేక ఉప సంఘం ఏర్పాటు చేసి మహిళా కార్మికుల కోసం నాయక పోరాటం నిర్వహిస్తోంది.నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు వర్గాలకు సంఘీభావం తెలుపుతోంది.ప్రత్యక్ష ఉద్యమాలలో పాల్గొంటోంది”అని తెలిపారు దేశంలో అతిపెద్ద కార్మిక సంఘాల్లో అగ్రభాగాన ఉన్నది.కాంట్రాక్ట్ విధానం,లేబర్ కోడ్‌లు, ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా ఎప్పుడూ దేశవ్యాప్తంగా పోరాడుతోంది” అని వారు అన్నారుదేశంలో సిఐటియు కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున పనిచేస్తుందని వారన్నారు వేలాది కార్మికులు సిఐటియు జెండాను ముద్దాడుతున్నారు ఇప్పటికే బిజెపి ప్రభుత్వం దుర్మార్గంగా 44 చట్టాలు ఉన్నటువంటి కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మికుల పైన ఉక్కు పాదం మోపడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారుఈ సందర్భంగా  పోరుమామిళ్ల సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు సోమయ్య ప్రకాష్ ఇరువురు సంయుక్తంగా మాట్లాడుతూ.ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వము 44 చట్టాలను అమలు చేయాలని లేని పక్షం అయితే కార్మికులు పెద్ద ఎత్తున బిజెపి ప్రభుత్వాన్ని పూలదగడం తప్పదన్నారు 8 గంటల పని దినాలను 12 గంటలు పని దినాలుగా మారుస్తున్న బిజెపి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా వారు అన్నారు దేశంలో బిజెపి మోడీ సర్కార్ ఇప్పటికైనా కార్మికుల పక్షాన నిలబడితే గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా వారు అన్నారు లేని పక్షం అయితే తన గూర్చి గాలికి కొట్టుకుపోతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో*సిఐటియు మండల అధ్యక్షులు సోమయ్య కార్యదర్శి ప్రకాష్ చిన్నయ్య రవి ఆలీబాషా మేకల వీరయ్య ఆచారి సుబ్బయ్య నజీర్ అంగన్వాడి యూనియన్ నాయకురాలు వాణి ఫాతిమా గాబ్రెల్ శ్రీనివాసులు బీబీ మేరీ ఓబులమ్మ అంకయ్య రాజు ఓబులయ్య జేమ్స్ ఫాతిమా వసంత వెంకట లక్ష్మమ్మ వెంకటమ్మ సుబ్బమ్మ నాయకులు, కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular