ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి: జడ్పీ సీఈవో
ప్రజావాణి మే 01:మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జడ్పీ సీఈవో, డిఆర్డిఓ శిరీష గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.కూలీల హాజరును,పనుల నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఆమె,రికార్డులను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఎండల తీవ్రత దృష్ట్యా కూలీలకు పని ప్రదేశంలో త్రాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఆంజనేయులు గారు, ఎ పి ఓ,కార్యదర్శి,ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.

