📄 ePaper
Thursday, April 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీశైలం దేవస్థానంలోనిహుండీల లెక్కింపు

శ్రీశైలం దేవస్థానంలోని
హుండీల లెక్కింపు

📰 Generate e-Paper Clip

శ్రీశైలం దేవస్థానంలోని
*హుండీల లెక్కింపు*
నంద్యాల జిల్లా శ్రీశైలం ఏప్రిల్ 23 (ప్రజావాణి)
ఈ రోజు (23.04.2026 )  జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి *రూ.4,83,22,554/-* లు నగదు రాబడిగా లభించింది.
కాగా  ఈ హుండీల రాబడిని భక్తులు గత *33 రోజులలో*  (21.03.2026 నుండి 22.04.2026 వరకు)  సమర్పించడం జరిగింది.
అలాగే  ఈ హుండీలో   162 గ్రాముల 200మిల్లీగ్రాముల బంగారు, 4కేజీల180 గ్రాముల వెండి లభించాయి.
అదేవిధంగా  144 – యుఎస్ఏ డాలర్లు,  9870 – శ్రీలంక రూపి, 90 – యు.ఎ.ఇ దిర్హమ్స్,    120 – సౌదీరియాల్స్,   20 – ఇంగ్లాండు పౌండ్స్ ,  151 – మలేషియా రింగిట్స్ ,  25– ఆస్ట్రేలియా డాలర్లు,    30 – యూరోలు, 25– కెనడా డాలర్లు,  1 – కువైట్ దినార్,  30 – న్యూజిలాండ్ డాలర్లు  మొదలైనవి  ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.
ఈ హుండీల లెక్కింపును కార్యనిర్వహణాధికారి  శ్రీ యం. శ్రీనివాసరావు  పర్యవేక్షించారు.  
ఈ కార్యక్రమములో  పలువిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు హుండీ లెక్కింపు పర్యవేక్షణలో పాల్గొన్నారు.  హుండీల లెక్కింపులో  సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular