
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన సీనియర్ పాత్రికేయులు,బహుముఖ ప్రజ్ఞాశాలి,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన కలం,యువ జర్నలిస్టులకు మార్గదర్శకుడిగా నిలిచిన మహనీయుడు శ్రీ మద్దికాయల.బలరామి రెడ్డి.గుండెపోటుకు గురై కడపలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున పరమపదించారు.ఈ విషాద వార్త తెలుసుకున్న బద్వేల్ నియోజకవర్గం YSRCP అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి గారు వారి స్వగ్రామానికి( B. మఠం మండలం, వెంకటాపురం గ్రామం) వెళ్లి పార్థివ దేహముపై పుష్పగుచ్ఛమును ఉంచి ఘన నివాళులు అర్పించడం జరిగినది. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగినది.ఈ సందర్భంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ మద్దికాయల.బలరామి రెడ్డి గారి మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని,కుటుంబ సభ్యులకు మనోధైర్యమును ప్రసాదించాలని మనస్పూర్తిగా భగవంతుని ప్రార్థించడమైనది.”
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన కలం మహనీయుడు శ్రీ మద్దికాయల. బలరామి రెడ్డికి ,,శ్రద్ధాంజలి
RELATED ARTICLES
