పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చేత డా. హరిప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు

మన ప్రజావాణి
చిత్తూరు, ఏప్రిల్ 21
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ జన్మదినం సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ డా. హరిప్రసాద్ ప్రజాసేవా తపనను కొనియాడుతూ, ఆయన రాజకీయ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
డా. హరిప్రసాద్ అందరి ఆశీస్సులతో మరింత సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

