
నెల్లూరు జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్16) (ఏప్రిల్15)నెల్లూరులోని ప్రముఖ వేదిక వీపీఆర్ కన్వెన్షన్లో నుడా ఛైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి కుమారుడు డాll సాయి ప్రజయ్ సేనారెడ్డి- డాll జాహ్నవిల వివాహ రిసెప్షన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ శుభకార్యానికి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు, వారి సతీమణి శ్రీమతి కాకర్ల ప్రవీణ గారు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన దంపతులు డాక్టర్ సాయి ప్రజయ్ సేనారెడ్డి,డాక్టర్ జాహ్నవి లను స్నేహపూర్వకంగా అభినందిస్తూ, వారి జీవితంలో ఈ కొత్త అధ్యాయం ఆనందం, ఐక్యత, ప్రేమతో నిండిపోవాలని ఆకాంక్షించారు. వారు ఎల్లప్పుడూ పరస్పర అవగాహనతో, ఆనందభరితమైన దాంపత్య జీవితం గడపాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు.అలాగే ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు, బంధుమిత్రులు నూతన దంపతులకు తమ ఆశీస్సులు అందజేసి, వారి భవిష్యత్తు విజయవంతంగా, సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.
