📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మతసామరస్యాన్ని లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడటమే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి విభజన హామీలు,

మతసామరస్యాన్ని లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడటమే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి విభజన హామీలు,

📰 Generate e-Paper Clip

కడపజిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్14)మతసామరస్యాన్ని లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడటమే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి విభజన హామీలు,కడప ఉక్కు కోసం అంబేద్కర్ స్పూర్తితో పోరాడి సాధించుకుందాం.DYFI,ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు వీరణాల శివకుమార్,వీరణాల.శివనారాయణ.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా జమ్మలమడుగు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి DYFI,ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.అనంతరం DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్,ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వీరణాల శివ నారాయణ లు మాట్లాడుతు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ అన్నారు.ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలన్నారు.అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం నేడు దేశంలో ప్రమాదంలో పడిందని దీనినిపరిరక్షించుకోవటానికి సామాజిక వేత్తలు, ప్రజాతంత్ర వాదులు ఐక్యంగ ముందుకు రావాలని కోరారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు అన్నారు.ముఖ్యంగా రాజ్యాంగంలోని ప్రధాన మౌలిక సూత్రమైన లౌకికవాదం ప్రమాదంలో పడిందని, మతసామరస్యం దెబ్బతింటుందని దళితులు,క్రైస్తవులు ముస్లిం,మైనార్టీల మీద నిరంతరం దాడిజరుగుతుందని అనచివేత ధోరణి కనిపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.మతం పేరుతో ప్రజల్లో చీలిక తెస్తున్నారని హిందూ,క్రిస్టియన్స్. ముస్లిం అంటూ, మతాల కుంపట్లు పెడుతున్నారని వారు దుయ్యబట్టారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మతవైశమ్యలను రెచ్చగోడుతున్నాయని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు ప్రజాప్రతినిధులు నేడు ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిని అడ్డుకోవాలని అప్పుడే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని వారన్నారు,దేశంలో కులాల మీద మతాల మీద జరుగుతున్న దాడిని తిప్పి కొట్టాలని, కుల నిర్ములనకోసం పాటుపడాలని వారు కోరారు.ముఖ్యంగా కేంద్రం విభజన హామీలు అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు.కడప ఉక్కు కు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు.కడప ఉక్కు కోసం,విభజన హామీల అమలు కోసం అంబేద్కర్ స్పూర్తితో పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో DYFI నాయకులు అరుణ్,శశి,సాయి,ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నాయకులు నారాయణ,రామకృష్ణ నాయకులు పాములేటి,శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు

Previous article
బట్రాజులను కించపరిచే వాక్యాలు చేస్తే సహించేది లేదు. ప్రభుత్వం నిరుపేద భట్రాజులకు సంక్షేమ పథకాలు అందించాలి. కార్పొరేషన్ చైర్మన్ నియామకానికి ముఖ్యమంత్రి సహకరించాలి. బట్రాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు విలాస కవి రామరాజు డిమాండ్ ప్రజావాణి న్యూస్ సూర్యాపేట. బట్రాజులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని సూర్యాపేట జిల్లా బట్రాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు విలాస కవి రామరాజు అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదటినుంచి కూడా బట్రాజులు మంచి గౌరవప్రదమైన పేరు ప్రతిష్టలను సంపాదించారని వాపోయారు. జిల్లాలో ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు అయినందున జిల్లాలో ఎన్నికల నిర్వహించారు. ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా బొల్లేపల్లి రఘురామరాజు మరియు గౌరవ అధ్యక్షులుగా విలాస కవి రామరాజు ప్రధాన కార్యదర్శిలుగా వేణుగోపాల కృష్ణంరాజు. దేనుమకొండ శేషం రాజు ఉపాధ్యక్షులు సరికొండ రామలింగరాజు మందపాటి శ్రీరామరాజు సరికొండ నాగరాజు కాసు రాఘవ రాజు సరికొండ బలరామరాజు మరియు. కోశాధికారి తంగేళ్ల చంద్రశేఖర్ రాజు. కార్యవర్గ సభ్యులు దేనుమకొండ పృథ్వీరాజు బొల్లెపల్లి రామచంద్ర రాజు ధూపాటి అంజమ్ రాజు హర్షవర్ధన్ రాజు దేనుమకొండ సైదరాజులు. ప్రచార కార్యదర్శిగా నక్క నాగరాజు సహాయ కార్యదర్శిగా సందేశ శ్రీనివాసరాజు పదవులలో కొలువుదీరారు. తదనంతరం యువజన సంఘం ఎన్నికలు నిర్వహించగా యువజన అధ్యక్షులుగా మందపాటి శ్రీనివాసరాజు ప్రధాన కార్యదర్శిగా సరికొండ చంద్రశేఖర్ రాజు ఉపాధ్యక్షులు కార్తీక్ రాజు సహాయ కార్యదర్శి వినయ్ రాజు కోశాధికారి హర్షవర్ధన్ రాజు ప్రచార కార్యదర్శి పున్నంరాజు కార్యవర్గ సభ్యులు నాగరాజు సాయి రాజు రిశి రాజు అరవింద రాజు యువజన సంఘం లో నియమితులు కావడం జరిగింది. సంఘ ఎన్నికల అనంతరం అధ్యక్షులు బొల్లేపల్లి రఘురామరాజు మాట్లాడుతూ కుల సంఘాలు ఏర్పరచుకునేది అందరినీ కలుపుకొని పోవడానికి గాని స్వార్థపూరితమైన మనసుతో ఒకరిని ఒకరు నిందించుకోవడం కోసం కాదు. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా కలిసికట్టుగా ఉండి కుల అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుల బంధువులు పెద్దలు చిన్నలు మహిళలు తదితరులు పాల్గొన్నారు
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.