నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూర్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీదేవి మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు SIR ప్రోగ్రాం గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం / సంబంధిత శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే నోటీసులు అందుకున్న వారితో పాటు, ఇప్పటివరకు అప్లై చేసుకోని కొత్త వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
*ఎవరు అప్లై చేసుకోవాలి?*
*1. నోటీసులు అందిన వారు:* మీకు SIR నోటీసు వచ్చి ఉంటే, వెంటనే సంబంధిత కార్యాలయంలో మీ డాక్యుమెంట్స్ సమర్పించి ప్రక్రియ పూర్తి చేయండి.
*2. కొత్తగా పెట్టుకోవాలనుకునే వారు:* ఇప్పటివరకు SIR ప్రోగ్రాం లో చేరని వారు కూడా సెప్టెంబర్ 16 లోపు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.
*కావాల్సిన పత్రాలు:*
ఆధార్ కార్డు, ఫోటో, సంబంధిత పత్రాలు తీసుకెళ్లి స్థానిక ఎమ్మార్వో/ మున్సిపల్ / గ్రామ పంచాయతీ సంప్రదించండి. *గడువు తేదీ*: సెప్టెంబర్ 16, 2026 – ఆ తర్వాత గడువు పెంచే అవకాశం లేదు. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఆఫీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

