వినాయక మండపం నిర్వాహకులకు అవగాహన సదస్సు ఎస్సై ప్రమోద్ కుమార్ .పెద్దవంగర సెప్టెంబర్ 08 ప్రజావాణి. .రాబోయే వినాయక చవితి సందర్భంగా, గత సంవత్సరం గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు మంగళవారం పెద్దవంగర పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.మండపం ఏర్పాటు చేసే ప్రతి నిర్వహకులు తెలంగాణ పోలీస్ ద్వారా ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టన్లో ఇంటిమేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయాలి.గణేష్ ని ఆగమనానికి మరియు నిమజ్జనానికి పోయే సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదని తెలియజేయడం జరిగింది.గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని.గణేష్ మండపం వద్ద ఏ సందర్భంలో అయినా కనీసం ముగ్గురు వ్యక్తులు ఉండాలని.గణేష్ మండపం వద్ద ఎలక్ట్రిసిటీ సంబంధించిన సమస్యలు రాకుండా విద్యుత్ శాఖ వారి అనుమతి తీసుకొని మండపానికి విద్యుత్ తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.నిమజ్జనం ఊరేగింపు సందర్భంలో మద్యపానం సేవించి వాహనాలను నడపడం గాని, అల్లర్లు చేయడం కానీ చేయకూడదని తెలియజేయడం జరిగింది.
వినాయక మండపం నిర్వాహకులకు అవగాహన సదస్సు
RELATED ARTICLES

