లయన్స్ క్లబ్ సేవ తరుణి
ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణిఆధ్వర్యంలో, పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
క్లబ్ అధ్యక్షురాలు లయన్ ఎం. రేణుకా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ సాయి గణేష్ జువెలర్స్ సభ్యురాలు లయన్ అనుపమ ఆర్థిక సహకారం అందించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే ఉద్దేశంతో భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ లయన్ వి. శైలజ క్లబ్ ట్రెజరర్ లయన్ కె. ఉమా రెడ్డి , క్లబ్ సభ్యురాలు లయన్ అనుపమ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పిస్తూ, మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ
మట్టి వినాయకుడిని పూజిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం తెలిపారు.

