నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మండలం నెర్మట గ్రామంలో కాంగ్రెస్ లీడర్ కోప్పోల వెంకన్న అకాల మరణంతో కాంగ్రెస్ కార్యక్రర్తలు మృతుడి కుటుంబానికి అర్థిక సాయం చేయడం జరిగింది. కోప్పోలు వెంకన్న కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగిళ్ళ క్పష్టయ్య, ఈరటీ శివలింగం, బోడ్డపల్గి రాముడు, గుయ్యని దశరథ, నారపాక దశరథ, గుంటోజు కిషోర్, తదితరులు పాల్గొనడం జరిగింది.

