మద్దూరు,దూళిమిట్టలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
మద్దూరు సెప్టెంబర్ 17, ప్రజా వాణి,
మద్దూరు,దూలిమిట్ట మండలాల్లోని అన్ని గ్రామాల్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు అధికారులు,సర్పంచులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మద్దూరు, దూలిమిట్ట తహసీల్దార్ కార్యాలయాల్లో తహసీల్దార్ ఏ. జి రహీమ్,శ్యామ్,ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ రామ్ మోహన్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై మహమ్మద్ ఆసీఫ్, కస్తూర్బాలో స్పెషల్ ఆఫీసర్ స్వప్న, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి రజిత,మద్దూరు,దూలిమిట్ట బాలుర వసతి గృహల్లో వార్డెన్లు చక్రధర్,సుధాకర్, ఇందిరా క్రాంతి వెలుగు కార్యాలయంలో అధ్యక్షురాలు స్రవంతి, రైతు వేదికలో ఏ ఓ రామకృష్ణ, అన్ని గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జెండా ఆవిష్కరణ చేశారు.ఈకార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్,అర్ ఐ కృష్ణ,సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్,ఏ పి ఓ మంజుల, ఏ పి ఏం ప్రకాశం, సి సి లు మహేందర్,కనకచంద్రం, ఆయా గ్రామాల జి పి ఓలు పాల్గొన్నారు.

