బీసీ బాలుర వసతి గృహంలో వైద్య పరీక్షలు..
భిక్నూర్, సెప్టెంబర్ 8, ( ప్రజావాణి) :
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది.భిక్నూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మండల వైద్యాధికారి యేమిమా ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఆరోగ్య పరీక్షలు పూర్తయిన అనంతరం విద్యార్థులకు అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య సిబ్బంది సూచించారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ పవన్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ వెంకటరమణ, ఏఎన్ఎం, శ్యామల, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

