జేఏసీ ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన
అనంత పురం బ్యూరో సెప్టెంబర్ 10 ప్రజా వాణి
ఏపీ జెఎసి, మెడికల్ అండ్ హెల్త్, ఆధ్వర్యంలో ఈరోజు 30 రోజుల కార్యచరణలో భాగంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో బ్లాక్ మాస్క్ ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని స్టాఫ్ నర్స్ మరియు పారామెడికల్ స్టాఫ్ అందరు కలిసి నిర్వహించారు.. ఈ సందర్భంగా ఏపీజిసియన్ డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీదేవి మాట్లాడుతూ, గవర్నమెంట్ మాకు ఇచ్చిన 30 రోజుల గడువులో మాకు గవర్నమెంట్ న్యాయం చేస్తుందని 16 సంవత్సరాల మా కలను నెరవేరేలా ఈ గవర్నమెంట్ చేస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నామని మా నమ్మకాన్ని ఈ గవర్నమెంట్ వోమ్ము చేయదని ఆశిస్తున్నామని చెప్పారు.. ఏపీ జేఏసీ కన్వీనర్ లావణ్య మాట్లాడుతూ, కరోనా వంటి సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడేమని చెప్పారు. ఎపిజిసిసి ఎన్ని సభ్యురాలు అనిత మాట్లాడుతూ, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న మాకు న్యాయం జరిగేలాగా గవర్నమెంట్ చూడాలని మాకు న్యాయం చేయాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ శరత్, ఏపీ జి సి ఎన్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఎర్రిస్వామి, కెఫా సునీత, మెడికల్ అండ్ స్టాఫ్ నర్స్ పాల్గొన్నారు

