ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కరెంటు DTR స్తంభం నేలకొరిగింది. దీంతో గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సంగ రమేష్ యాదవ్ వెంటనే స్పందించారు. ఆయన విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, తక్షణమే కొత్త DTR స్తంభాన్ని ఏర్పాటు చేయించారు. సర్పంచ్ చొరవతో సకాలంలో విద్యుత్ పునరుద్ధరణ జరగడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
సర్పంచ్ తక్షణ స్పందన: రాజారాంపల్లిలో పునరుద్ధరించిన విద్యుత్ సరఫరా
RELATED ARTICLES

