నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
వార్డు మెంబర్ల ఫోరం మునుగోడు నియోజకవర్గ ఇంచార్జిగా కస్తాల గ్రామానికి చెందిన వార్డుసభ్యురాలు బొమ్మరబోయిన కవిత సైదులు ఎంపికయ్యారు. గురువారం ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి అపాయింట్ లెటర్ అందచేశారు. ఈ సందర్భంగా తన కవిత ఎంపిక పట్ల సూచనతో ప్రతినిత్యం గ్రామాభివృద్ధికి పాటుపడుతూ వార్డ్ సభ్యుల సమస్యలపై అందుబాటులో ఉంటానని, అదేవిధంగా తన పట్ల విశ్వాసంతో నియోజకవర్గ ఇన్చార్జిగా అవకాశం కల్పించిన ఫోరం రాష్ట్ర అధ్యక్షులకు, తన ఎన్నికకు సహకరించిన వార్డు సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

