తొర్రూర్ లో ఘనంగా తిరుపతి రెడ్డి నూతన గృహప్రవేశ వేడుకలు
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి
తొర్రూరు పట్టణ కేంద్రంలో బృందావన ఎస్టేట్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డి నూతన గృహ నిర్మాణం చేశారు. గురువారం నూతన గృహప్రవేశ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ శుభకార్యక్రమానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల నరేందర్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెరటి యాకుబ్ రెడ్డి హాజరై నూతన గృహాన్ని సందర్శించి, తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన గృహంలో సుఖ శాంతులతో , ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, కుటుంబ సభ్యులందరూ జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్మారపు మహేందర్ ఉప సర్పంచ్ జినుగు రవీందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎక్కటి నాగిరెడ్డి , ఇం
దిరమ్మ కమిటీ అధ్యక్షులు బీరెల్లి మహేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు గజ్జి దర్గయ్య , మండల నాయకులు చిట్టిమల్ల మహేష్ ముఖ్య నాయకులు కొత్త శ్రీధర్ కుమార్ ధర్మారపు నాగయ్య , గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

