తంగళ్లపల్లి ఎస్సైగా అశోక్ బాధ్యతల స్వీకరణ
తంగళ్లపల్లి ప్రజావాణి ఆగస్టు 21 తంగళ్లపల్లి పోలీస్స్టేషన్ నూతన ఎస్సైగా అశోక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ వర్గాల వారు నూతన ఎస్సై అశోక్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై అశోక్ మాట్లాడుతూ తంగళ్లపల్లి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని, ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నూతన ఎస్సై అశోక్కు స్థానికులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఆకాంక్షించారు.

