📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedakగిరిజన మోర్చా బలోపేతానికి కృషి చేయాలి

గిరిజన మోర్చా బలోపేతానికి కృషి చేయాలి

📰 Generate e-Paper Clip

గిరిజన మోర్చా బలోపేతానికి కృషి చేయాలి
వివిధ మండలాల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేత
నర్సాపూర్: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో వివిధ మండలాలకు గిరిజన మోర్చా అధ్యక్షులను నియమించారు. నర్సాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్, బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు లావుడ్యా రాములు నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నర్సాపూర్ మండల గిరిజన మోర్చా అధ్యక్షుడిగా సుభాష్ నాయక్, ఆత్నూర్ మండల గిరిజన మోర్చా అధ్యక్షుడిగా బానోత్ ఆంజనేయ, మాసాయిపేట మండల గిరిజన మోర్చా అధ్యక్షుడిగా లింగం నాయక్‌లను నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులకు జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో గిరిజన మోర్చా నాయకులు కీలక పాత్ర పోషించాలని జిల్లా నాయకులు సూచించారు. మండలాల్లోని గిరిజన ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రజలకు చేరేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి మండలంలో గిరిజన యువత, మహిళలు, ప్రజలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ వారి పక్షాన నిలబడినప్పుడే పార్టీపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్, బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు లావుడ్యా రాములు నాయక్, వివిధ మండలాల గిరిజన మోర్చా అధ్యక్షులు, మెదక్ జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కుమార్ నాయక్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.