📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadమరిపెటలో విషాదం ఆర్ఎంపి నిర్లక్ష్యానికి మూడేళ్ల బాలుడు బలి

మరిపెటలో విషాదం ఆర్ఎంపి నిర్లక్ష్యానికి మూడేళ్ల బాలుడు బలి

📰 Generate e-Paper Clip

మరిపెటలో విషాదం…ఆర్ఎంపీ నిర్లక్ష్యానికి మూడేళ్ల బాలుడు బలి!


మహబూబాబాద్ జిల్లా(కేసముద్రం) జూలై 27,ప్రజావాణి.



మహబూబాబాద్ జిల్లా మరిపెట కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడు, ఒక స్థానిక ఆర్ఎంపీ   క్లినిక్‌లో చికిత్స పొందిన అనంతరం మృతి చెందాడు. ఆర్ఎంపీ చేసిన  నిర్లక్ష్య వైద్యమే తమ బిడ్డ ప్రాణం తీసిందని బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.



ఘటన వివరాలు:


స్థానిక సమాచారం ప్రకారం.. మరిపెడకు చెందిన మూడేళ్ల బాలుడు గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని స్థానికంగా ఉన్న ఒక ఆర్ఎంపీ క్లినిక్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలుడికి వైద్యుడు చికిత్స అందించి, కొన్ని మందులు ఇచ్చాడు. అయితే, చికిత్స పొందిన కొద్దిసేపటికే బాలుడి ఆరోగ్యం క్షీణించి, ప్రాణాలు కోల్పోయాడు.




క్లినిక్ మూసివేసి ఆర్ఎంపీ పరారీ:



బాలుడు మరణించాడనే విషయం తెలియగానే సదరు ఆర్‌ఎమ్‌పీ అప్రమత్తమయ్యాడు. బాధ్యత నుండి తప్పించుకోవడానికి వెంటనే తన క్లినిక్‌కు తాళం వేసి, అక్కడి నుండి పరారయ్యాడు. ప్రస్తుతం అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది.



పోలీసుల దర్యాప్తు – కుటుంబ సభ్యుల ఆందోళన:



తమ బిడ్డ మరణానికి కారణమైన ఆర్ఎంపీని వెంటనే అరెస్ట్ చేయాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు క్లినిక్ ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న మరిపెట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న ఆర్ఎంపీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని, విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.