📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కడప ఎస్పీ కీలక నిర్ణయం: పోరుమామిళ్లలో అందుబాటులోకి సీఐ కార్యాలయం.. ఇకపై డ్రోన్ల నిఘా నీడలో...

కడప ఎస్పీ కీలక నిర్ణయం: పోరుమామిళ్లలో అందుబాటులోకి సీఐ కార్యాలయం.. ఇకపై డ్రోన్ల నిఘా నీడలో నేరగాళ్లు!

📰 Generate e-Paper Clip

కడప జిల్లా పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 12) పోలీస్ స్టేషన్ (CI ఆఫీస్) ఆవరణలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) గారి చేతుల మీదుగా అధునాతన డ్రోన్ కెమెరాను గాల్లోకి ఎగురవేసి అధికారికంగా ప్రారంభించారు:ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా కడప జిల్లా పోలీస్ శాఖ స్మార్ట్ పోలీసింగ్‌ వైపు వేగంగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా శుక్రవారం పోరుమామిళ్ల మండలం లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) కార్యాలయ ఆవరణలో ప్రత్యేక నిఘా కోసం కేటాయించిన అధునాతన డ్రోన్ కెమెరాను కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) తన చేతుల మీదుగా గాల్లోకి ఎగురవేసి, ఈ డ్రోన్ సర్వైలెన్స్ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్పీ తో పాటు పోరుమామిళ్ల సీఐ, స్థానిక ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సీఐ ఆఫీస్ ప్రాంగణం నుండి డ్రోన్‌ను ఆపరేట్ చేస్తూ,దాని ద్వారా లభించే విజువల్స్ మరియు కంట్రోల్ సిస్టమ్‌ను ఎస్పీ స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.అసాంఘిక కార్యకలాపాలపై గగనతల నిఘాఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. సమాజంలో నేరాల నియంత్రణకు, అసాంఘిక శక్తుల ఆటకట్టించడానికి సాంకేతికత ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేశారు.ముఖ్యంగా పోరుమామిళ్ల పరిసర ప్రాంతాల్లో గంజాయి రవాణా, జూదం,గుట్కా అమ్మకాలు, ఇసుక అక్రమ రవాణా వంటి అక్రమ కార్యకలాపాలపై ఇకనుంచి ఈ డ్రోన్ల ద్వారా డేగ కన్ను వేయనున్నట్లు తెలిపారు. మనుషులు వెళ్లలేని మారుమూల ప్రాంతాలు, దట్టమైన పొదలు లేదా గుట్టల వెనుక జరిగే తవ్వకాలు, అనుమానాస్పద కదలికలను ఈ డ్రోన్ కెమెరాలు ఇట్టే పసిగడతాయని ఆయన వివరించారు.ట్రాఫిక్ నియంత్రణ, పండుగ బందోబస్తుకు సైతం.కేవలం నేరాల గుర్తింపే కాకుండా, పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు, పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడే పండుగలు, జాతరలు, మరియు రాజకీయ నిరసనల సమయంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు ఈ డ్రోన్ ఎంతో ఉపయోగపడుతుందని ఎస్పీ పేర్కొన్నారు.

అత్యవసర సమయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఈ డ్రోన్ ప్రత్యక్ష విజువల్స్ పంపడం ద్వారా త్వరితగతిన స్పందించి అవాంఛనీయ సంఘటనలను అరికట్టవచ్చని చెప్పారు.నేరస్థులకు గట్టి హెచ్చరికపోరుమామిళ్ల సర్కిల్ పరిధిలో ఎవరైనా చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని,ఈ డ్రోన్ నిఘా ద్వారా నిందితులను ఆధారాలతో సహా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ  హెచ్చరించారు.ప్రజల భద్రతకు తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని,సాంకేతికతను జోడించి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో డ్రోన్ ఆపరేటింగ్ విధానాన్ని సిబ్బంది ఎస్పీ కి ప్రదర్శించి చూపగా, స్థానిక ప్రజలు మరియు వ్యాపారస్తులు పోలీస్ శాఖ తీసుకున్న ఈ హైటెక్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇకపై పోరుమామిళ్ల ప్రాంతంలో నిఘా మరింత పటిష్టం కానుందని సీఐ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.