హుస్నాబాద్ నుండి బెజ్జంకి కీ బస్సు సర్వీస్ ప్రారంభం
బెజ్జంకి,మార్చి 26(ప్రజావాణి)
ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు హుస్నాబాద్ బస్ స్టేషన్ నుండి బెజ్జంకి కీ బస్సు సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు హుస్నాబాద్ డిపో మేనేజర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరి వయా మైసంపల్లి, చంచల్ చెరువుపల్లి, కోహెడ మీదుగా బెజ్జంకి 10 గంటల వరకు చేరుకుంటదని తెలిపారు. తిరిగి బెజ్జంకి నుండి ఉదయం 10:10 కీ బయలు దేరి 11:20 గంటల వరకు చేరుకుంటదన్నారు. ఈ యొక్క బస్సు రాకతో కోహెడ, బెజ్జంకి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.




