గొల్లపల్లి మండలం శంకర్రావుపేట గ్రామంలో ఈరోజు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దర్ర రాజన్న (45) అనే రైతు తన పొలంలో వరి నాట్ల కోసం దుక్కి సిద్ధం చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో రాజన్న అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆయన ఆకస్మిక మరణంతో శంకర్రావుపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
శంకర్రావుపేటలో తీవ్ర విషాదం: విద్యుత్ షాక్తో రైతు రాజన్న మృతి
RELATED ARTICLES




