ఘట్కేసర్, జూలై 23: విద్యుత్ లైన్ల నిర్వహణ, చెట్ల కొమ్మల తొలగింపు (ట్రీ ప్రూనింగ్), ఫీడర్ నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో శుక్రవారం (జూలై 24) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ హరినాథ్ సగ్గు తెలిపారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎస్వీ కాలనీ, బాపూజీ నగర్, కమలా నగర్, సాయి నగర్ ఈస్ట్, సుదర్శన్ నగర్ కాలనీ, వరంగల్ జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో, కమలా నగర్, సాయి నగర్ ఈస్ట్, ధరణి కాలనీ, బాపూజీ నగర్, అరుణోదయ కాలనీ, ఎస్వీ కాలనీ, పీ అండ్ టి కాలనీ, వెస్ట్ కమలా నగర్, విశ్వం విహార్, సుమా రెసిడెన్సీ, గురు ఎన్క్లేవ్, భగత్సింగ్ నగర్, అయోధ్య కాలనీ, ఎస్సీ కాలనీ.
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాయి హిల్స్, పీ అండ్ టి కాలనీ, శ్రీనివాస నగర్, వినాయక నగర్, సంపూర్ణ కాలనీ ప్రధాన రహదారి, సాయిరాం నగర్ కాలనీ, క్రాంతి కాలనీ, గ్రీన్ల్యాండ్స్ కాలనీ, పంచవటి కాలనీ రోడ్లు 1, 2, 3, విహారిక కాలనీ రోడ్లు 1 నుంచి 5 వరకు, కాకతీయ నగర్ కాలనీ, ధరణి కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.
వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.




