📄 ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
HomeతెలంగాణWarangalభూముల రీ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

భూముల రీ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

📰 Generate e-Paper Clip

భూముల రీ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

వరంగల్ జిల్లా సర్వే ఏడి శ్రీనివాసులు

​చెన్నారావుపేటజూలై 09 ప్రజావాణి

భూముల రీ సర్వేకు గ్రామాల్లోని రైతులందరూ సహకరించాలని వరంగల్ జిల్లా సర్వే ఏడి శ్రీనివాసులు కోరారు. గురువారం మండల కేంద్రంలోని తిమ్మరాయిని పహాడ్ గ్రామంలో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూముల రీసర్వే అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు..మండలంలోని తిమ్మరాయిని పహాడ్, జల్లి, అక్కల్ చెడ, లింగాపురం, కోనాపురం గ్రామాలను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశామని, రైతుల భూ సమస్యల పరిష్కారానికే ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులు, అధికారులు సమన్వయంతో సర్వేను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మహమ్మద్ ఆబిద్ అలీ, సర్పంచ్ రమేష్, గిర్దావర్ మమత, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular