బెజ్జంకి, మే 27(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మండల పార్టీ కార్యాలయాన్ని మానకొండూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పార్టీ బలోపేతానికి మండల స్థాయిలో కార్యాలయాలు కీలకమని డా. రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి శ్రీమతి కనగండ్ల కవిత తిరుపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు రాజయ్య, సర్పంచ్ లు తాళ్లపెల్లి భీమయ్య,ఉప సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు దీటి బాలనర్సు, బెజ్జంకి ఉప సర్పంచ్ దుమాల మహేష్,సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, చింతకింది శ్రీనివాస్ గుప్తా,ముక్కిస తిరుపతి రెడ్డి,చేలుకల తిరుపతి రెడ్డి,వార్డ్ సభ్యులు,గ్రామ శాఖ అధ్యక్షులు,మండల, గ్రామ స్థాయి నాయకులు,ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



