బెజ్జంకి, మే 3(ప్రజావాణి )
అఖిలభారత యువజన సమాఖ్య (AIYF)67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జండా ఎగరవేత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ బెజ్జంకి మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ జెండా ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, సమానత్వం, న్యాయం కోసం పోరాడాలని,ఏఐవైఎఫ్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత చైతన్యవంతంగా పనిచేయాలని సూచించారు.

