📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబూరుగుపల్లి సర్పంచ్ మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ..

బూరుగుపల్లి సర్పంచ్ మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా వర్గల్, ఏప్రిల్ 14, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం లోని మైలారం గ్రామంలో మంగళవారం రోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల్ ప్రెసిడెంట్ అవుసులపల్లి నవీన్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ ,ఉపసర్పంచ్ లింగ స్వామి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular