మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయము
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి సంతాపం
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం తండా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త హలావత్ వసంత్ నాయక్ మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పార్టీ కార్యకర్తల ద్వారా వారి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ రాములు నాయక్, మాజీ ఎంపీటీసీ మునియా నాయక్, వినోద్ నాయక్, కిషన్ నాయక్, మంగ నాయక్, గ్రామ సర్పంచ్ మోహన్ నాయక్, రవీందర్ నాయక్, గ్రామ ఉపసర్పంచ్ నరేష్ నాయక్, వార్డు సభ్యులు మోహన్ నాయక్, గణేష్ నాయక్, రవీందర్ నాయక్, దేవుల తదితరులు పాల్గొన్నారు.




