📄 ePaper
Monday, April 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్లలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత సృష్టిస్తున్న యాజమాన్యం.ఎమ్మార్వో కి వినతి పత్రం,,సిపిఎం

పోరుమామిళ్లలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత సృష్టిస్తున్న యాజమాన్యం.ఎమ్మార్వో కి వినతి పత్రం,,సిపిఎం

📰 Generate e-Paper Clip

వైయస్సార్ కడప జిల్లా ప్రజా వాణి న్యూస్ (ఏప్రిల్20) పోరుమామిళ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో పోరుమామిళ్లలోని పెట్రోల్ బంకులు పెట్రోల్ లేదని బోర్డు పెట్టడం ఎలా అంటూ ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవ ప్రసాద్,సిఐటియు మండల కార్యదర్శి సగిలి ప్రకాష్ సంయుక్తంగామాట్లాడుతూ.పోరుమామిళ్లలో ఆరు పెట్రోల్ బంకులు ఉండగా ఆరు పెట్రోల్ బంకులు లో పెట్రోల్ డీజిల్ నిల్వలు అయిపోయినాయి అని బోర్డు పెట్టడం ప్రజలకు ఇబ్బందిపాటి చేయడం అని వారన్నారు ఈ విషయాన్ని ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మార్వో తనిఖీకి పంపిస్తానని కింది అధికారులను పంపించడం జరిగింది యుద్ధాలు కారణంగా పెట్రోలు గ్యాస్ డీజిల్ అయిపోయిందని యాజమాన్యం ప్రజలకు చాలా ఇబ్బందులు చేస్తున్నారని వారు అన్నారు కలెక్టర్. ఆర్డీవో.ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరతలేదని చెప్పడం పేపరు మీడియాలకు ఇవ్వడం జరుగుతుంది అని వారన్నారుఅయినా గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్రోలు లీటరు 130 రూపాయలుదాక అమ్ముతున్నారని డీజిల్ అదే విధంగా అమ్ముతున్నారని పోరుమామిళ్లలో గ్యాస్ 1800 నుంచి 200 వరకు బ్లాక్ లో జరుగుతుందని వారన్నారు ఇప్పటికైనా కలెక్టర్,ఆర్డీవో,చొరవ తీసుకొని ఎమ్మార్వో ను ప్రతి పెట్రోల్ బంకులకు తనిఖీ చేసి ఇబ్బందులు లేకుండా ప్రజలకి కస్టమర్లకి ఇబ్బందులు లేకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వాలు చూస్తే ఎక్కడ కూడా గ్యాస్ పెట్రోలు డీజిల్ కొరతలేదని ముక్తకంఠంతో పేపరు మీడియాకు యుద్దం సందర్భంగా ప్రజలకు కస్టమర్లకు తెలియజేస్తున్నారు.ఇక్కడ చూస్తే స్టాక్ లేదని బోర్డు పెట్టడం చాలా దుర్గం అని వెంటనే అన్ని పెట్రోల్ బంకులను తనిఖీ చేయాలి అన్నారు పెట్రోల్ బంకులుల్లో మంచినీటి సరఫరా కల్పించాలి,లెటిన్ బాత్రూం కల్పించాలి ఇవన్నీ ఉండిన శుభ్రతగా లేవు అరకొరగూ మాత్రమే ఉంటున్నాయని వారున్నారు వెంటనే తనిఖీ చేసి యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు లేనిపక్షం అయితే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని వారు అన్నారు ఎమ్మార్వో కి ఇచ్చే వినిత పత్రంలో పార్టీ నాయకులు ఆలీ భాష ప్రసాద్ పాల్గొన్నారు అభినందనలతో.యన్భై రవప్రసాదు సిపిఎం మండల కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular