*చెస్ క్రీడాకారిణిని అభినందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్*
*అవొపా కోదాడ అభినందనలు*
కోదాడ మే 24/ ప్రజావాణి
ఈ సంవత్సరం ఫిభ్రవరి లో హైదరాబాదులో జరిగిన జరిగిన ఛీప్ మినిస్టర్ ఆటల పోటీలలో చదరంగంలో రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచిన కోదాడ లోని తేజ విద్యాలయలో 7వ తరగతి చదువుతున్న ఓరుగంటి అనంత లక్ష్మి D/o వెంకటేశ్వరరావు (OV) ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తన
కార్యాలయము లో ఆదివారం శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందించారు. ఈసందర్భంగా ఐదువేలు నగదు బహుమతిని అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి బి. వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. అనంతలక్ష్మీని అవొపా కోదాడ పట్టణ అధ్యక్షులు కందిబండ వెంకటేశ్వరావు,సూర్యాపేట జిల్లా అవొపా అధ్యక్షులు ఇమ్మడి రమేష్,స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ అధ్యక్షులు కార్యదర్సులు నీలా సత్యనారాయణ చారుగుండ్ల ప్రవీణ రాజశేఖర్ ఓరుగంటి కిట్టు మరియు తదితరులు అభినందించారు.




