ఘట్కేసర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల
ఘట్కేసర్, జూలై 19: రోడ్డు ప్రమాదాల నివారణ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నియంత్రణ లక్ష్యంగా ఘట్కేసర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఘట్కేసర్ ట్రాఫిక్ స్టేషన్ ఎస్హెచ్ఓ రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఘట్కేసర్ ట్రాఫిక్ పరిధిలోని డి మార్ట్ సమీపంలో ఈ తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు బ్రెత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
నిబంధనలు ఉల్లంఘించి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఐ శీనయ్య, ఎస్ఐలు మల్లయ్య, సోమయ్య, ఏఎస్ఐ రమేష్ యాదవ్ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




