
ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) విజయవాడ స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు నివాసంలో ACB జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. 760 గ్రాముల బంగారం, దాదాపు 8 కిలోల వెండి, ₹22 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, ఒక భవనం, స్థలాలకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ₹16 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన శ్రీనివాసరావు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు.


