అమరావతి ప్రజావాణిన్యూస్(మార్చి25) సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర రాజధాని అమరావతి నందు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి గౌ. శ్రీ కె.విజయానంద్ గారిని, పంచాయతి రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారి గౌ.శ్రీ శశి భూషణ్ కుమార్ గారిని, కమిషనర్ ఐఏఎస్ అధికారి గౌ.శ్రీ వెంకట కృష్ణ తేజ తదితర అధికారులను ఏపీ జెన్కో రాష్ట్ర అధ్యక్షులు కె. సాల్మన్ గారు, జిల్లా గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి భాస్కరరావు గారు, జిల్లా అధ్యక్షులు పిచ్చికె బాబు,బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎర్రబల్లె ఓబయ్య గారు, కమలాపురం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సి. ఓబులేసు గారు, స్టేట్ లీడర్ పి.వి. రమణ గారు తదితరులు కలిసి స్టేట్ వైడ్ గా 26 జిల్లాల్లో కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్స్ అసిస్టెంట్ గా నియమించబడి 2018 వ సంవత్సరంలో దాదాపు 300 మంది ఉద్యోగుల ఎలాంటి సర్వీస్ లేకుండా పాలసీనీ అమలు చేయడం జరిగింది.కావున వారీ సర్విస్ కు సంబంధించిన సమస్యను వారి పూర్తి సర్వీసుతో కూడిన జీతభత్యాలు చెల్లించాలని కోరుతూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఫైల్ అంతా చదివి సానుకూలంగా స్పందించిన అధికారులందరూ మీ సమస్యలో న్యాయం ఉంది. మీకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.
అమరావతిలో కడప జిల్లా MEF నాయకులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ని బద్వేల్ నాయకులు కలవడం జరిగింది
0
15
- Advertisment -



