లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ళను త్వరగా పూర్తి చేసుకోవాలి
సిద్దిపేట జిల్లా, బెజ్జంకి, మార్చి 24, ప్రజావాణి
లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనీ ఎంపిడివో కడివేర్గు ప్రవీణ్ సూచించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పోస్ట్ ఫ్యాక్టో వెరిఫికేషన్ కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొని మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని స్పష్టంగా అమలు చేస్తుందని, లబ్ధిదారుల నిబంధన మేరకు, స్టేజీల వారీగా నిధులు లబ్ధిదారుల ఖాతాలోనే జమ అవుతున్నాయన, ప్రభుత్వం పేదలకు కల్పించిన అవకాశాలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈ ఈ,హౌసింగ్ ఏఈ రవళి, గ్రామ సర్పంచ్ వెంకట లక్ష్మి, పంచాయతీ సెక్రటరీ గారలు తదితరులు పాల్గొన్నారు.




